బోడుప్పల్లో కొనసాగుతున్న వక్ఫ్ బోర్డు బాదితుల రిలే నిరాహార దీక్షలు

Published: Saturday March 11, 2023
మేడిపల్లి, మార్చి10 (ప్రజాపాలన ప్రతినిధి)

 బోడుప్పల్ మున్సిపల్  కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో గల మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద వక్ఫ్ బోర్డు బాదితుల జేఏసీ అధ్వర్యంలో 13వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దిశలో  

జి శ్రావణి, శ్యామల, సంగీత, ఘనకుమారి, సుగుణవతి కూర్చున్నారు. వారికి జేఏసీ కో చైర్మన్, బీజేపీ కార్పోరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, గోనె శ్రీనివాస్, కూరపాటి విజయ్ కుమార్, భావన, ప్రహ్లాద రెడ్డి, నర్సింహులు, ప్రవీణ్ రెడ్డి పెద్ద సంఖ్యలో మహిళలు, కాలనీ వాసులు , బాదితులు సంఘీభావం తెలిపారు.