పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
Published: Wednesday August 11, 2021
పాలేరు ఆగస్ట్ 9 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండలం లో పొట్టి శ్రీరాములు సెంటర్ నందు సిఐటియు.& ఏఐకెఎస్ - ఏఐఏడబ్ల్యుయు. అద్వర్యంలో పొట్టి శ్రీరాములు సెంటర్ లో సిపిఎం. రాష్ట్ర కమిటీ పిలుపు, మేరకు సిపిఎం. మండల పార్టీ ఆద్వర్యంలో పెంచిన విద్యుత్, గ్యాస్, డిజిల్, పెట్రోల్ యూరియా, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్ష చేయటం జరిగింది. నిరసన దీక్షలో పాల్గొన్న నాయకులకు పగిడికత్తుల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుడవర్తి నాగేశ్వరరావు, రచ్చా నరసింహారావు, సిపిఐ నేలకొండపల్లి గ్రామ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు,మందడపు మురళి, కేవీ రెడ్డి, బాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి. కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలుపుటకు దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ పాలేరు డివిజన్ నాయకులు బచ్చల కూరి నాగరాజు, ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజని, మాట్లాడుతూ ఢిల్లీ రైతులు ధర్నా చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయిన రూ. వారికి వారి కుటుంబ లకు ప్రభుత్వ ఉద్యోగం, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్. అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విదనలను ఖండించారు,ఈ కార్యక్రమంలో జెర్రిపోతుల సత్యనారాయణ, గుడిబోయిన వెంకటేశ్వర్లు,రెడ్డిమల్ల బాబురెడ్డి, చట్టు శ్రీను, నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: