చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం అందజేత
Published: Wednesday January 25, 2023
జన్నారం, జనవరి 24, ప్రజాపాలన: మండలంలోని కవ్వాల్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు మురిమడుగు ఉటూకురి శ్రీనివాస్ రెడ్డి పదివేల రూపాయలు విరాళం అందజేశారు. కవ్వాల్ ఛత్రపతి శివాజీ సభ్యులు విరాళం అందజేశానికి ఆయనను శాలువాతో సత్కరించారు. అదేవిధంగా బిజెపి జన్నారం మండల్ ప్రధాన కార్యదర్శి వంగపల్లి శ్రీనివాస్ ఐదు వేల రూపాయలు చత్రపతి శివాజీ కమిటీ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. రాతలు ఎవరైనా ఉంటే విగ్రహ ప్రతిష్టాపన కొరకు విరాళం అందజేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం, దండవేణి శ్రీధర్, బుర్ర గడ్డ జగన్, గంగాధర్, మండల బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: