నిరుద్యోగార్థుల ఆశల పల్లకి

Published: Thursday March 10, 2022
మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బి.రాచయ్య
వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన : సిఎం కేసిఆర్ నిరుద్యోగార్థులలో ఆశలను రేకెత్తించే ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారని మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బి.రాచయ్య అన్నారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో సిఎం కేసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త జిల్లాల విభజన అనంతరం జోన్ల సమస్య పరిష్కారం అయ్యిందని పేర్కొన్నారు. జిల్లాల వ్యాప్తంగా ఏర్పడిన  ఖాళీలు అన్నింటిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించడం హర్షణీయమని కొనియాడారు. ప్రతి నిరుద్యోగార్థి ఏకాగ్రతతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. నిరుద్యోగార్థుల కోసం తల్లిదండ్రులు అహర్నిశలు పడ్డ కష్టాన్ని వమ్ము చేయకుండా ఉద్యోగం పొందాలని హితవు పలికారు. ఈ కార్యక్రంలో ఉపసర్పంచ్ అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు, రమేష్ గౌడ్, సురేందర్ రెడ్డి, ఖధీర్, రాచయ్య కావలిహరిచరన్, దశరథం, ప్రభాకర్, ప్రభు, జగదీష్, సుదర్శన్ తదితర యువకులు పాల్గొన్నారు.