శ్రీ అనంతపద్మనాభ స్వామి రథోత్సవం

Published: Thursday November 10, 2022

వికారాబాద్ బ్యూరో 9 నవంబర్ ప్రజా పాలన : కార్తీక మాసం పెద్ద జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి నిర్వహించిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి రథోత్సవంలో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు పొందారు. చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత ఆలయ శుద్ధి అనంతరం రథోత్సవం జరిగింది. ఇట్టి ఉత్సవాల్లో శాసన సభ్యులతో పాటు పుర ప్రముఖులు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వికారాబాద్  పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 11.00 గం లకు స్వామి వారి గరుడోత్సవాన్ని ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం ఈవో టి నరేందర్ జూనియర్ అసిస్టెంట్ శాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్తీక మాసం జాతర ఉత్సవాల్లో భాగంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి గరుడ వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.