ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పువ్వాడ
Published: Tuesday September 07, 2021
మధిర, సెప్టెంబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంసిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎర్రుపాలెంలో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఆగారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. మద్యాహన భోజనం పై విద్యార్థులను ఆరా తీశారు. టాయిలెట్స్, త్రాగునీరు వసతులు, పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక, హాజరు శాతం ను ప్రధానపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో టైల్స్ పగిలిపోవడం గుర్తించిన మంత్రి తక్షణమే బాగుచేయలని ఆదేశించారు. వారి వెంట జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ V.P గౌతమ్ తదితరులు ఉన్నారు..
Share this on your social network: