అక్రమగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
Published: Friday December 16, 2022
జన్నారం, డిసెంబర్ 15, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని జన్నారం, ఇందన్పల్లి రేంజ్ పరిధిలో అటవీ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి కమాన్పల్లి, టీజీ పల్లి గ్రామాల్లో దాడులు నిర్వహించి, రూ.49,000 విలువ చేసే టేకు సైజులు, ప్లాంకుల అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేయడం జరిగిందని గురువారం అటవీ అధికారులు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో మూడు నంబర్లు తెలియని బైక్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: