వీఆర్ఏల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలి వారి న్యాయపరమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ సంపూర

Published: Saturday July 30, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి.

గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థలో భాగంగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల నిరవధిక సమ్మెలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల *వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని స్థానిక జడ్పిటిసి బింగి దేవదాస్ గౌడ్ తో కలిసి* సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి  అండగా ఉంటారని తెలియజేశారు..గ్రామాలలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ధరణి పోర్టల్ ను పూర్తిగా రద్దుచేసి సరికొత్త రెవెన్యూ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని వీఆర్ఏ వీఆర్వోలను పూర్తిస్థాయిలో వారి సేవలను వినియోగించుకుంటామని తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం అధ్యక్షులు ప్రసాద్, శ్రీనివాస్, నరేష్, ముత్యాలు, విష్ణు, సత్తయ్య తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడిపల్లి వెంకటేష్,పాశం జైహింద్,శివకుమార్ యాదగిరి,లోకేష్ రెడ్డి,మహేందర్,ప్రవీణ్తదితరులు పాల్గొనడం జరిగింది.