అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నీరాజనం పొందుతున్న బూర్గంపాడు జడ్పిటిస

Published: Thursday November 10, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
 
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో   అనునిత్యం ప్రజలకు కొరకు కార్యక్రమంలో భాగంగా  మేరకు సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని  కండక్టర్స్ కాలనీ లో బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ,విస్తృతంగా పర్యటించారు ఉదయం 6 గంటల నుంచి కాలనీలలో పర్యటించి సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు త్రాగునీరు ,డ్రైనేజీ ,రహదారులు, విద్యుత్ స్తంభాలు, ఏర్పాటు ప్రజలు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడారు సమస్యలను త్వరగారితిన పూర్తి చేయాలని ఆమె కోరారు.
 పినపాక నియోజకవర్గలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు, నియోజవర్గంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను  శ్రీ రేగా కాంతారావు  కృషితో , కోట్లాది రూపాయల నిధులు మంజూరు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారన్నారు, వారి సహకారంతో అనేక గ్రామాలకు సిసి రోడ్లు బీటి రోడ్ల నిర్మాణం, కల్వర్టులు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, ప్రజల దగ్గరికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారి సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు, ప్రజా సమస్యలు పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్ని మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్తు కాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా బిఆర్ఎస్  ప్రభుత్వం పని చేస్తుందన్నారు, ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని అన్నారు, గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ప్రభుత్వం అందిస్తుంది అన్నారు రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు, భారతదేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అమలు అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సారపాక టౌన్ అధ్యక్షులు కునకంచి శ్రీను గారు, పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లుకోటి పూర్ణ చందర్, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మి చైతన్య రెడ్డి, బిఆర్ స్ సినియర్ నాయకులు బెల్లంకొండ రామరావు ,,  మండల కార్మిక విభాగము, మర్రి సాంబిరెడ్డి, ,  బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, ఉప అధ్యక్షుడు సట్టు అంజనేయులు ,  బిఆర్ స్ పార్టీ నాయకులు బెజ్జంకి కనక చారి సారపాక టౌన్ బిసి కార్యదర్శి,వల్లెపు బొబ్బిలి, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, మండల మహిళా అధ్యక్షురాలు లలిత,  నక్క రమాదేవి, మాజి  ఎంపిటిసి  దాసరి వెంకటరమణ, చుక్కపల్లి  బాలాజీ,  సాయిబాబు, కాకాని రాంబాబు, కర్రీ నాగేశ్వరరావు,  తుపాకులు రవి కుమార్,   పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు