కేశవపట్నం వైన్స్ లో తనిఖిలు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు శంకరపట్నం జనవరి 03 ప్రజాపాలన రిపోర
Published: Thursday January 05, 2023
శంకరపట్నం మండల కేంద్రం లోని శ్రీ లక్ష్మి నర్సింహా వైన్స్ లో మంగళవారము ఎక్సైజ్ శాఖ పోలీస్ లు తనిఖీలు చేశారు. సోమవారం అంబాలపూర్ కి చెందిన వ్యక్తి ఇదే వైన్స్ లో బీరు తాగి అస్వస్థతకు గురైన సంఘటనపై విచారణ చేసేందుకు ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహించినట్టు ఎక్సైజ్ శాఖ పోలీసులు తెలిపారు.కల్తీ మద్యం,అవకతవకలకు పాల్పడితే చట్టరిత్య చర్యలు తప్పవని వైన్స్ నిర్వాహకులను హెచ్చరించారు. వైన్స్ షాప్ పర్మిట్ రూమ్ నిర్వహణ కూడా సరిగా లేదని నాణ్యతలేని ఆహారపదార్థాలు విక్రయిస్తున్నారని మద్యం ప్రియులు ఆవేదన చెందుతున్నారు.
Share this on your social network: