ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి * ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ కలిసి వినతిపత్రం
Published: Thursday November 10, 2022
బుదవారం రోజున మంచాల మండలం చిత్తాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ని చిత్తాపూర్ నుండి కోఠికి 8 గంటలకు బస్సు వేయాలని కోరడమైనది రాచకొండ తిప్పాయిగూడ తాళ్లపల్లి గూడా మూడు గ్రామాల నుండి వచ్చే స్కూల్ పిల్లలు బస్సులో రద్దీగా రావడంతో మా గ్రామంలో విద్యార్థులు నానా అవస్థలు పడుకుంటూ నడుచుకుంటూ మంచాల వరకు వెళ్తున్నారు ప్రతిరోజు 20 నుండి 30 వరకు విద్యార్థుల్ని వదిలి వెళ్తున్నారు. కావున దయచేసి బస్సు వేయాలని కోరనైనది ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బొడ్డు నాగరాజు ఉప సర్పంచ్ రేణుక రవి వార్డు సభ్యులు శ్రీనివాస్, విజయశ్రీ, నరసింహారెడ్డి, శర్మష్, చంద్రయ్య సరిత, నాగరాజ్, ధనలక్ష్మి, మహేందర్, సత్తయ్య, , పాల్గొన్నారు.
Share this on your social network: