కార్పోరేటర్ మందడి శ్రీనివాసరావు : ఆధ్వర్యంలో శానిటైజేషన్
Published: Wednesday May 19, 2021
కూకట్ పల్లి, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆదేశాలతో KPHB 114 డివిజన్ కార్పొరేటర్ శ్రీ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు మూడవ ఫేస్ లో శానిటైజేషన్ చేయడం జరిగినది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు కట్టా నరసింగరావు పాల్గొని కాలనీలో ఉన్న ప్రతి సందులో ప్రతి వీధిలో రోడ్డు కిరువైపులా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈ సందర్భముగా కట్టా నరసింగరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దని ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు ప్రజలందరూ విధిగా సహకరించాలని, దగ్గు జ్వరం జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే జిహెచ్ఎంసి సిబ్బంది కి ఫోన్ చేసి తెలియ జేయాలని, అలాంటివారికి మందుల కిట్లను ప్రభుత్వం ఉచితముగా అందజేస్తున్నదని, ప్రజలు ఎవరూ భయపడవద్దని, జిహెచ్ఎంసి జోనల్ మేనేజర్ మమత గారు డి సి రవికుమార్ నియోజకవర్గంలో జ్వర సర్వే ను పగడ్బందీగా నిర్వహిస్తూ సిమ్మ్ టమ్స్ ఉన్న వారికి వెంటనే మందులు కిట్లను పంపిణీ చేస్తున్నారని అన్నారు. మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పోరేటర్ మందడి శ్రీనివాసరావు ప్రజా సమస్యలపై ఎల్లవేళల అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమములో జిహెచ్ఎంసి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ మహేందర్ రెడ్డి, SFA లు మహంకాళి సూర్యనారాయన, నరసింహ, స్తానిక నాయకులు మండవ సుబ్రహ్మణ్యం, కొల్లా శంకర్, ఏనూతుల మహేశ్, హరి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: