ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
Published: Tuesday May 25, 2021
ఇటిక్యాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి
రాయికల్, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలకేంద్రంతో పాటు అన్నిగ్రామలలో కరోనా బాధితులకు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటిక్యాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి జలందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కోవిడ్ బాధితున్న పడుతున్న, ఇల్లు లేని వారికి కరోనా సోకితే కిరాయి కి ఉన్న యజమానులు బయటకు పంపితే వారి పరిస్థితి ఘోరంగా ఉంటుందని వారు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. కావున మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో గవర్నమెంట్ స్కూల్ లలో గాని, మోడల్ స్కూల్ లలో గాని ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికీ సహాయం అందించాలని అన్నారు. కరోనా బాధితులను గుర్తించి వారికీ అన్నివిధాలా సహాయం అందిచేలా చూడాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేసారు.
Share this on your social network: