అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ నియమకం శంకరపట్నం జనవరి 22 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Wednesday January 25, 2023
శంకరపట్నం మండలం ధర్మారం గ్రామంలో ఆదివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు గొట్టే అర్జున్ ఆధ్వర్యంలో ధర్మారం గ్రామ శాఖను నియమించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ధర్మారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా దేవునూరి అశోక్, గౌరవా అద్యక్షుడిగా బూర్తుల సదయ్య, ఉపాద్యక్షుడు బూర్తుల రాజు, తాళ్లపెల్లి కిరణ్, ప్రదానకార్యదర్శిగా దేవునూరి అనిల్, కార్యదర్శులుగా తాళ్లపెల్లి వినయ్, రెడ్డి కుమార్, కోశాదికారిగా ఎల్కపల్లి కార్తీక్, సంయుక్త కార్యదర్శులుగా గాజుల కొండల్, నునే మహేందర్, ప్రచారకార్యదర్శులుగా దేవునూరి ప్రశాంత్, గాజుల హరీష్ , కార్యవర్గసభలుగా దేవునూరి అనిల్, సాయితేజ, సిద్దూ, నవీన్, టింకూ, బర్తులా త్రిలక్షిత్, జంగం రాజేందర్, కొంకటి అశోక్, తాళ్లపెల్లి అశోక్, సలహదారులుగ దేవునూరి కొమురయ్య, ఎల్కపల్లి సుధీర్ ని నియమిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి దేవునూరి కుమారస్వామి ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సంఘం దేశంలోని 24 రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూర్తుల సదానందం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంబాలపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సముద్రాల సదానందం, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: