ఎస్టీయూ మండల అధ్యక్షులుగా ఎగ్యారపు వెంకటేష్

Published: Saturday October 02, 2021
మల్లాపూర్, అక్టోబర్ 01 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (ఎస్టీయూ) మండల శాఖ ఎన్నికలు మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగాయి. ఇట్టి ఎన్నికలకు ఎన్నికల అధికారిగా సాయి కుమార్, పరిశీలకులుగా శివరామ కృష్ణ వ్యవహరించారు. సభ్యులంతా కలిసి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా ఎగ్యారపు వెంకటేష్ (ప్రా.పా సిర్పూర్), ప్రధాన కార్యదర్శిగా దారవేని జీవన్ (ప్రా.పా చిట్టాపుర్), జిల్లా కౌన్సిలర్ గా పుప్పాల రాజేందర్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా పుప్పాల మధు, ఉపాధ్యక్షులుగా గోవర్ధన్, శోభ, అనిత లను జాయింట్ సెక్రటరీ లుగా భవాని, శ్రీకాంత్, సతీష్, అదనపు సెక్రటరీ గా వెంకట రమణ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎగ్యరపు వెంకటేష్ గారు మాట్లాడుతూ ఉద్యోగులకు వెంటనే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానమును వెంటనే రద్దు పరచి పాత పెన్షన్ విధానమును వర్తింప జేయాలని డిమాండ్ చేశారు.