భట్టి చొరవతో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..
Published: Tuesday February 01, 2022
ఎర్రుపాలెం జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని రాజుల దేవరపాడు ఎర్రుపాలెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులు, వేమిరెడ్డి వెంకట్ రెడ్డి-24,000 మరియు ఎస్కే కాసిం సాహెబ్-13,500 లకు మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి స్థానిక శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క చొరవతో మంజూరైన చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సొసైటీ ఉపాధ్యక్షులు కడియం శ్రీను, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు తలుపు రెడ్డి నాగిరెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే జానీ భాషా, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీను, ఎర్రుపాలెం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్మాయిల్ మరియు మండల నాయకులు కంచర్ల వెంకట నరసయ్య మరియు గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది.
Share this on your social network: