యాదాద్రి ఆలయ గోపురానికి విరాళాలు మంత్రి మల్లారెడ్డికి అందజేసిన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్

Published: Friday October 29, 2021
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్లో వివిధ కాలనీల ప్రజల నుండి సేకరించిన విరాళాలు దాదాపు రూ 1,51,228 రూపాయల నగదును డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌౌడ్, 24వ డివిజన్ కార్పొరేటర్ ఎంపల్ల అనంత రెడ్డి  ప్రజల నుండి సేకరించిన రూ 1,71,116/ నగదు, 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి రూ 10,116 నగదు, 4వ డివిజన్ కార్పొరేటర్ యాసారం మహేశ్వరి మహేష్ ప్రజల నుండి సేకరించిన రూ 50,572 నగదును తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డికి విరాళాలు అందజేశారు.