మోడీ ప్రజా సంక్షేమ పథకాలు పార్టీకి శ్రీరామరక్ష..

Published: Wednesday June 16, 2021
ఖమ్మం జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే దేశ ప్రజలకు శ్రీరామరక్ష అని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) అన్నారు. సోమవారం జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖాజా ఆధ్వర్యంలో లలితాపురం గ్రామంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగిందని, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో తాము చేస్తున్నట్లు టిఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని చిన్ని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు. జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు మహమ్మద్ ఖాజా మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ కారులు ఈటెల రాజేందర్ బిజెపిలో చేరుతున్న సందర్భంగా లలితాపురం గ్రామంలోని 20 కుటుంబాలు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మేకల రామారావు, మేకల వెంకటేశ్వర్లు, గీరకాటి సురేష్, గున్న పిచ్చయ్య, మేకల రాధాకృష్ణ, ఎండి ఆసిఫ్, ఎస్కే పర్వీన్ చిత్తా రపు వంశీ, వినుకొండ సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్. నాగరాజు, రాష్ట్ర నాయకులు మావునూరు మాధవ్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా నాయకులు రాంచందర్ నాయక్, ఎన్ శాసనాల రామయ్య. మహేష్, శివకుమార్ ఖండేల్వాల్, శ్రీనివాస్, రాము, ఇసుకల వెంకటేశ్వర్లు, శ్రీనివాస చారి, ఇరుప లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.