ఉచిత అంబలి పంపిణీ

Published: Tuesday June 14, 2022

మంచిర్యాల టౌన్, జూన్ 13, ప్రజాపాలన : మంచిర్యాలలో వేసవిలో ప్రజలకు నిరాటకంగా పంపిణీ చేసిన ప్రేమ్ సాగరన్న ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమంకు మంగళవారంతో ముగింపు పలక నున్నట్లు కొక్కిరాల రఘుపతి రావు చారి టబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి,  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ వెల్లడించారు. సోమవారం అంబలి పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత నెల మే 14వ తేదీ నుండి  మంచిర్యాల ఐబీ చౌరస్తా,  ఆర్టీసీ బస్ స్టాండ్,  సి సి సి, శ్రీరాంపూర్, లక్సెట్టిపేట  కేంద్రాలలో అంబలి పంపిణీ ఏర్పాటు చేశామని తెలిపారు. 31 రోజులు నిరంతరంగా   అంబలి పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. వర్షాకాలం ఆరంభమై రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లబడి వర్షాలు పడే  అవకాశం ఉన్నందున చలివేంద్రాలు త్రాగు నీటి ట్యాంకర్ల ద్వారా త్రాగు నీటి సరఫరా కూడా నిలిపివేస్తున్నట్లు, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు   తెలిపారు.