విఅర్ఏ సమస్యలు పరిష్కరించాలి

Published: Wednesday July 27, 2022

జన్నారం, జూలై 26, ప్రజాపాలన: రాష్ట్ర విఅర్ఏ కమిటీ నిర్ణయా మేరకు ఈ నెల ఇరువైఐదు తేదీ నుండి మండల కేంద్రంలోని విఅర్ఏ సమస్యలు పరిష్కరించాలని మండల విఅర్ఏ  అధ్యక్షుడు జగ్గిషేట్టి రాజశేఖర్ మంగళవారం అన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసిఆర్ బుటకపూ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక విఅర్ఏ లను మోసం చెసినాడు, నోటికి వచ్చిన హమిలు అన్ని చెప్పి వాటిని అమలు చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు, విఅర్ఏ సమస్యలు పట్టించుకోకుండా వదిలేసిందని వారి ప్రదాన డిమాండ్లు అయిన  లిపే, స్కేల్, జీవోను వేంటనే విడుదల చేయాలని, అర్హత గల విఅర్ఏ లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, యాబైఐదు సంవత్సరముల పైబడిన విఅర్ఏ స్థానంలో వారసులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యాక్రమంలో విఅర్ఏ మండల ఉపాధ్యక్షుడు దాసండ్ల రాజలింగు, ప్రధాన కార్యదర్శి కాసారపు శీనివాస్, కోశాధికారి బోడ్డు రాజుకుమార్,  ప్రచార కార్యదర్శులు గుమ్ముల శ్రీనివాస్, ముగ ప్రసాద్, మగ్గిడి దేవయ్య తదితరులు పాల్గొన్నారు