సోనియమ్మ ఆయురారోగ్యాలతో జీవించాలి.. రామ్మూర్తి నాయక్, కట్ల రంగారావు

Published: Saturday December 10, 2022

వైరా, డిసెంబర్ 9 (ప్రజాపాలన న్యూస్): తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని టిపిసిసి సభ్యులు ధరావత్ రామ్మూర్తి నాయక్, టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు పేర్కొన్నారు. శుక్రవారం అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ  జన్మదిన వేడుకలు వైరాలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవిని సైతం తునప్రాయంగా రెండుసార్లు త్యాగం చేసిన గొప్ప మహనీయురాలని వారు అన్నారు. రానున్న ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిరిపురం ఎంపీటీసీ మట్టూరి కృష్ణారావు, రేచర్ల నాగేశ్వరరావు, కట్ల నాగరాజు, రేచర్ల రాముడు, కట్ల సంతోష్,  పాణ్యం భాస్కర్, గుత్తికొండ వీరబాబు పాల్గొన్నారు.