బీజేపీ అద్వర్యం లో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం. శంకరపట్నం అక్టోబర్ 28 ప్రజాపాలన:

Published: Saturday October 29, 2022

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేస్తుందని డ్రామాలు చేస్తూ బిజెపి నాయకులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకుల వైఖరిని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండలాధ్యక్షులు చల్లా ఐలయ్య మానకొండూర్ నియోజకవర్గం బీజేపీ నాయకులు వోరెం జయచందర్  అధ్వర్యంలో ఈ రోజు శంకరపట్నం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు, కేశవపట్నం ఎంపీటీసీ2 ఏనుగుల అనిల్,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్,మండల శాఖ ఉపాధ్యక్షులు కాంతాల రాజిరెడ్డి,పెసరి అర్జున్,మంద శ్రీనివాస్ రెడ్డి,సుదగోని శ్రీనివాస్,మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మందాడి జగ్గారెడ్డి,ఉపాధ్యక్షులు రెడ్డి రమణారెడ్డి,దళిత మోర్చా మండలాధ్యక్షులు కనకం సాగర్,BJYM మండల అధ్యక్షులు బొడిగె నరేష్,ఉపాధ్యక్షులు బొజ్జ సాయి,OBC మోర్చా మండల ప్రధాన కార్యదర్శి  శ్రీకాంత్,బూత్ అధ్యక్షులు చింతిరెడ్డి రాజిరెడ్డి,కరణం సమ్మిరెడ్డి,కేశవేణి అశోక్,నాయకులు పల్లె శివారెడ్డి,సాయి తదితరులు పాల్గొన్నారు.