విఆర్ఎ ల సమ్మె కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టియస్ యుటియఫ్

Published: Wednesday July 27, 2022

బోనకల్, జులై 26 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రము లో గత రెండు రోజులుగా విఆర్ఎల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె కు టియస్ యుటియఫ్ బోనకల్ మండల కమిటీ తరుపున సంఘీభావం ప్రకటించడం జరిగింది.ఈ సంధర్భంగా యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ విఆర్ఎలకు పిఆర్పీ పే స్కేలు అమలు చేయాలని,పదోన్నతులు ఇవ్వాలని , వారికి న్యాయమైన సమ్యసలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో టియస్ యుటియఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, యస్ సధాబాబు, జల్లా.కోటయ్య, పి.రవికుమార్, టిపిటియఫ్ నాయకులు డి.రవికిరణ్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.