రెండో రోజు డ్వాక్రా మహిళలకు వ్యాక్సినేషన్

Published: Thursday June 17, 2021
బాలపూర్, జూన్16, ప్రజాపాలన ప్రతినిధి : బాలపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వారు డ్వాక్రా మహిళలకు వాక్సిన్ కార్యక్రమాని చక్కగా కొనసాగిస్తున్నారని కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జిల్లెల్గుడా లో ఉన్న చల్లా లింగారెడ్డి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ లో డ్వాక్రా మహిళలకు కొవిడ్ 19 టికా ను రెండో రోజు చక్కగా ఆర్ పి, పి.హెచ్.సి సిబ్బంది వారు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కి మాధవి గౌడ్ మాట్లాడుతూ.... నిన్నటి నుండి డ్వాక్రా మహిళలకు వాక్సిన్ కార్యక్రమాన్నికి ప్రతీ డ్వాక్రా మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం లో కార్పొరేషన్ తెరాస అధ్యక్షులు సిద్దల లావణ్య బీరప్ప, కార్పొరేటర్ జిల్లెల్ల అరుణ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.