దాడులకు పాల్పడితే సహించేది లేదు

Published: Friday May 28, 2021
సుడా చైర్మన్ విజయ్
ఖమ్మం మే 27 ప్రజాపాలన ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయాలను ప్రొత్సహిస్తుందని, అందుకే రౌడీ షీటర్లకు కార్పొరేషన్ ఎన్నికలో టికెట్లు ఇచ్చిందని సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, మాజీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ పగడాల నాగరాజు లు ఆరోపించారు.. గురువారం పార్టీ  కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో వివిధ డివిజన్లో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన్నట్ల తెలిపారు. 57వ డివిజన్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బాధితులకు ఇంటి వద్ద చెక్కులు ఇచ్చేందుకు వెళ్లామని తెలిపారు. అక్కడ కార్పొరేటర్ భర్త ముస్తఫా అనే రౌడీ షీటర్ కొంత మంది యువకులతో వచ్చి దాడికి పాల్పడిన్నట్లు ఆరోపించారు.. దాడుల సంస్కృతి ఖమ్మం నగరంలో సృష్టించడం సరైంది కాదన్నారు, కాంగ్రెస్ పార్టీ నేర చరిత్ర కలిగిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్లనే ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో రౌడీ మూకలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అడ్డుపడి ప్రజలను భయభ్రాంతులకు గురి చెస్తున్న వారిని ప్రజలు క్షమించరని తెలిపారు. 57వ డివిజన్లో ప్రజల సమస్యలు ఉంటే కార్పొరేటర్, మంత్రి దృష్టికి తీసుకొచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణ చైతన్య, మైనారిటీ నాయకులు తాజ్ తదితరులు పాల్గొన్నారు.