ఘనంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జన్మదిన వేడుకలు

Published: Thursday June 24, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జన్మదిన వేడుకలను కొండాపూర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలోని పార్టీ ఆఫీసు నందు ఘనంగా జరిగాయి. తెరాస పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కి జన్మదిన వేడుకలు జరిపి, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేటర్ కు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గులాబీ పువ్వు రేకులతో పుష్పాభిషేకం, పూల దండలతో, శాలువాతో సత్కారించారు. ఈ సందర్బంగా శ్రీరామ్ నగర్ పార్టీ ఆఫీసు నందు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన బర్త్ డే కేకును కార్పొరేటర్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్బంగా పార్టీ ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరోనా కష్ట కాలంలో అహర్నిశలు ప్రజల కోసం కష్టపడినా 180 మంది జీహెచ్ఎంసి సఫాయి కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణి చేసి బిర్యానీ భోజన ప్యాకెట్లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో, దీవెనలతో కరోనా భారీ నుండి కోలుకొన్నానని, ప్రజల ప్రార్ధనల వల్ల  ఆరోగ్యావంతున్ని అయ్యానని పేర్కొన్నారు. ప్రజా సేవ చేసి, కొండాపూర్ డివిజన్ అభివృద్ధికు మరింత కృషి చేసి వారి ఋణం తీర్చుకొంటానని తెలియజేశారు. తన కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్బంగా విచ్చేసి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు, అభిమానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ యూత్ నాయకులు ఆదిల్ పటేల్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, తెరాస సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, చాంద్ పాషా, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, సీనియర్ నాయకులు జంగం గౌడ్, తిరుపతి యాదవ్, గఫుర్, సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి, మహ్మద్ అలీ, హినాయత్, రాజు యాదవ్, శ్రావణ్ యాదవ్, కుమ్మరి శ్రీను, షబ్బీర్, కుమార్, రజనీకాంత్, గణపతి, ఉస్మాన్, అడ్వకేట్ కృష్ణవేణి, స్వామి, ఖాసీం, శైలజ, సాయి కుమార్, రవి శంకర్ నాయక్, విజయ్, గౌరీ, రూప,నందు, వెంకటి, మంగమ్మ, లావణ్య, డా రమేష్, గిరి గౌడ్, యాదగిరి, సత్యం గౌడ్, యూత్ నాయకులు దీపక్, జుబేర్, కరీం, వసీమ్ తదితరులు పాల్గొన్నారు.