రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేస్తున్న ఎంపీపీ స్వర్ణలత.

Published: Friday January 28, 2022

కొడిమ్యాల, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణం గురించి భూమి పూజ చేయడం జరిగినది. గత 50 సంవత్సరాల నుండి రోడ్డు లేక ప్రజలు నానా ఇబ్బందులు  పడుతుండడంతో బుధవారం రోజున పైడిపల్లి వంశం మరియు కనుకుంట్ల వంశం వారు రోడ్డుకు 18 ఫీట్ల వెడల్పు తో 150 మీటర్ల పొడవుతో భూమి ఇవ్వడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, సింగిల్విండో చైర్మన్ రాజ నర్సింగరావు మరియు సర్పంచ్ అంబటి లత తిరుమలేష్, ఉప సర్పంచ్ బొజ్జ నరయ్య, మండల ఉపాధ్యక్షుడు రోడ్డ శరత్ శంకర్, గాజుల నరేష్ పోచయ్య, లక్ష్మీరాజ్యం, ఆకునూరి తిరుపతి, దశరథం, తదితరులు పాల్గొన్నారు.