వర్షకొండలో గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం

Published: Friday July 02, 2021
ఇబ్రహీంపట్నం, జూలై 01 (ప్రజాపాలన ప్రతినిధి) : గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన 4వ విడత పల్లె ప్రగతి  కార్యక్రమంపై గ్రామ సభ జరిగింది. గ్రామంలో గల పలు సమస్యలపై సర్పంచ్ కి స్థానిక గ్రామ ప్రజలు విన్నవించారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, గ్రామఅభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని, మన గ్రామాన్ని అభివృధి చేసుకుందామని అందరు సహకరించాలని కోరారు. తదనంతరం పల్లే ప్రగతి కార్యక్రమంలో బాగంగా దళిత వాడలలో పర్యటించి వార్డుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేష్ , గ్రామ సర్పంచ్ దొంతుల శ్యామల తుకారం , ఉప సర్పంచ్ మంగిలి పెళ్ళి లక్ష్మణ్  లక్ష్మణ్, ఎంపిటిసి పొనుకంటి చిన్న వెంకట్, వార్డ్ మెంబర్ దశ గౌడ్, రమేష్ ప్రశాంత్ ఏ ఎన్ ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.