దుర్గమాత ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన గంగన్న

Published: Tuesday December 13, 2022
జన్నారం, డిసెంబర్ 12, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో చేపట్టిన "దుర్గామాత" ఆలయ నిర్మాణానికి సోమవారం మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన ఇంటలిజెన్స్ ఏ ఎస్ ఐ జాడి గంగన్న ఐదువేల పదహారు రూపాయల విరాళాన్ని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఆలయ కమిటీ చైర్మన్ జాడి గంగాధర్ కు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ జాడి గంగాధర్ మాట్లాడుతూ. తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందించాలని కోరారు. దుర్గమాత అతి త్వరలో ఆలయాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జాడి వెంకట్, సుధాకర్, తాళ్లపల్లి రాజేశ్వర్, సీనియర్ పాత్రికేయులు నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.