కూలిపోయిన ఇల్లను పరిశీలించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Tuesday July 12, 2022
బెల్లంపల్లి జూలై 11 ప్రజా పాలన ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బెల్లంపల్లి పట్టణం లోని రడగంబాల బస్తీకి చెందిన పలువురి ఇండ్లు కూలిపోగా, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు కోల్పోయి నష్టం జరిగిన కుటుంబాలకు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా అందించే సహాయాన్ని త్వరితగతిన అందించే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.
 నియోజకవర్గ పరిధిలో ఈ అతిభారీ వర్షాల కారణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తమకు తెలియచేయాలని, నియోజకవర్గ ప్రజల సేవ కోసం తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.
తక్షణ కర్తవ్యంగా నిన్న ఇండ్లు కూలిపోయిన వారిని స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాలలో, పునరావాసం కల్పించి భోజన వసతులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దామెర శ్రీనివాస్ , ఇతర కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తెరాస నాయకులు, మున్సిపల్ కమిషనర్ గంగాధర్ , తదితరులు పాల్గొన్నారు.