పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి అని కాంగ్రెస్ ధర్నా

Published: Saturday June 12, 2021
మధిర, జూన్ 11, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీఅఖిలభారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మధిర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మధిర మండల పట్టణ  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ల వద్ద ధర్నా కార్యక్రమం జరిగిందిమధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ ప్రజల పై పెనుభారం మోపుతూ డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంట నూనెల ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై పెను భారం మోపుతున్నారు అన్నారు. ఒక్కపక్క ప్రజలు కరోనాతో లాక్ డౌన్ విధించి అల్లాడుతుంటే నరేంద్రమోదీ విపరీతంగా ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని, ఇప్పటికైనా నరేంద్రమోదీ కళ్ళు తెరచి పెట్రోల్, డీజిల్ గ్యాస్ వంట ధరలు వెంటనే తగ్గించాలి అని లేని పక్షంలో ప్రజలు తగిన సమయం లో తగిన బుద్ధి చెబుతారు అన్నారు... ఈ ధర్నా కార్యక్రమంలో, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు, దారా బాలరాజు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అద్దంకి రవి కుమార్, ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు, కోరం పల్లి చంటి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు, ఎస్కే జాకీర్ సైదా అల్లిపురం సర్పంచ్, పులి బండ్ల చిట్టిబాబు, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, ఆవుల కిరణ్, గాంధీ పాద మండల అధ్యక్షులు, బోడేపూడి గోపి నాథ్,  ముస్లిం మైనారిటీ అధ్యక్షులు, మహమ్మద్ అలీ, సేవాదళ్ మండల అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్, ఎస్ టి, సెల్ మండలాధ్యక్షులు, బాలు నాయక్, గొల్లమందల శ్రీనివాస్, బుర్ర శ్రీను మైలవరపు చక్రి, గౌస్ ఉద్దీన్ జింకల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు,