అమ్మ ఫౌండేషన్..నందిని విక్రమార్క గారి ఆధ్వర్యంలో లో నిత్యావసర సరుకుల పంపిణీ

Published: Friday June 11, 2021
మధిర పట్టణంలో కరోనా బాధిత కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్.
మధిర, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ ఈరోజు మధిర మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధిర శాసనసభ్యులు గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు ఈరోజు మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల రమణ గుప్తామరియు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు చేతుల మీదగాకి అందజేయడం జరిగింది లాక్ డౌన్ లో కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మా కుటుంబాన్ని గుర్తించి సహాయం చేసిన మల్లు నందిని విక్రమార్కగారికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారుఈ కార్యక్రమంలో మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిరియాల కాశీ విశ్వేశ్వరావు, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, కాంగ్రెస్ నాయకుడు షేక్ గౌస్ ఉద్దీన్, మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు