టీపీసీసీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఖుతుబొద్దిన్ పాషా

Published: Monday July 12, 2021
మెట్ పల్లి, జూలై 11 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎనుముల రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ లను శనివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దిన్ పాషా హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. పట్టణానికి రావలసిందిగా కోరగా రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ లు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.