ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా - దుమాల రాజ్ కుమార్

Published: Monday February 22, 2021

జగిత్యాల, ఫిబ్రవరి 21 (ప్రజాపాలన): జగిత్యాల పట్టణంలోని ఖిలాగడ్డలో అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఏనుగందుల మోహన్ ఆధ్వర్యంలో నూతనంగా నియమించబడ్డ జగిత్యాల జిల్లా ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యునిగా దుమాల రాజ్ కుమార్ ను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ నియామకంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని దళితుల అభివృద్ధి సమస్యలను తీర్చిడం కొరకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి కి ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దుమాల శంకర్ బాబు నాయకులు ఏనుగందుల గంగారాం దుమాల కిష్టయ్య దుమాల రాజాం గంగాధర్ చంద్రం ఉమా మహేష్ రఘు దేవనందం ఒడ్డెటి అఖిల్ దుమాల పురుషోత్తమ్ శేషిదర్ దేవనందం సంపత్ ఆకాష్ వంశీ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.