మండలంలో ఘనంగా TRS జెండా పండుగ కార్యక్రమం

Published: Friday September 03, 2021
బోనకల్, సెప్టెంబర్ 02, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలంలో ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ జండా పండగ కార్యక్రమాన్నినిర్వహించాలనే పిలుపులో భాగంగా మండలంలో ముష్టికుంట్ల, రావినూతల వివిధ గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, బొమ్మెర రామ్మూర్తి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జండా పండగ నిర్వహించాలని దానిలో భాగంగా ఈరోజు  టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం సంతోషకరమైన విషయమని ఎన్నో ఉద్యమ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర లో మన రాష్ట్ర పాలన లో బాగంగా బంగారు తెలంగాణా సాధనకోసం ఏర్పడ్డ ఉద్యమ రాజకీయ పార్టీ జెండ ఇంతటి గొప్ప ప్రక్యతి గల గులాబీ జెండ గొప్పతనం నీ అందరు గుర్తించాలి ఆని గులాబీ జెండకి అండగా ఉండాలి ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు, సొసైటీ అధ్యక్షులు, రైతు బంధు సమితి నాయకులు వివిధ హోదాల్లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.