యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురుకుల కళాశాల పాఠశాల లో సందర్శశించిన తూమాటి నవీన్

Published: Tuesday August 02, 2022

రెడ్డి మధిర ఆగస్టు ఒకటి ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడు కృష్ణాపురం నందు కల మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాల మరియు మైనార్టీ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో నెలకొన్న పరిస్థితులపై నీయోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుతుమాటి నవీన్ రెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వారి సమస్యలు తెలుసుకుని కళాశాల ప్రిన్సిపాల్ మరియు వార్డెన్ ల తో మాట్లాడటం జరిగిందిఈ సందర్భంగా జ్యోతిబాపూలే జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు బెడ్స్ లేవని అలాగే ఫ్యాన్స్ లేవని విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చరర్స్ లేరని కూడా తెలుసుకున్నారు ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు

అలాగే భోజనం విధానాల్లో కాంట్రాక్టర్ వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసి అతనికి ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయగా అందుబాటులో రాలేదు ఈ సమస్యపై కూడా శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు సరైన భోజనం వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు చెప్పడం జరిగింది అలాగేతరగతి గదులను బాత్ రూం వంట గదులను పరీసీలించి సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపా ల్ కు సూచించారు తెలంగాణ వ్యాప్తంగా గురుకుల కళాశాలలో మరియు పాఠశాలల్లో విష ఆహారo వల్ల చాలామంది విద్యార్ధిని విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారు కనుక ఆహార జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహార సదుపాయాలను కల్పించాలని లేనియెడల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని విద్యార్థులకు ఎప్పుడు కూడా యువజన కాంగ్రెస్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు

ఈ కార్యక్రమంలో దేవరకొండ రాజీవ్ గాంధీ, యామాల రవి, పోచేపల్లి సురేష్ ఆవుల కార్తీక్ గొల్లమందల, ఉదయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు