పేద కుటుంబాలకు బిఎల్ఆర్ ట్రస్ట్ అండ

Published: Wednesday December 14, 2022
ట్రస్ట్ ప్రతినిధి నేమూరి మహేష్ గౌడ్
మేడిపల్లి, డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి)
ఆపదలో ఉన్న పేద కుటుంబాలను బిఎల్ఆర్ ట్రస్ట్ అన్ని విధాల ఆదుకుంటూ అండగా నిలుస్తుందని   ట్రస్ట్ ప్రతినిధి నేమూరి మహేష్ గౌడ్ పేర్కొన్నారు.ప్రమాదంలో గాయపడి కూతురి పెళ్ళి కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఉప్పల్ నియోజకవర్గం చిన్న చర్లపల్లికి  చెందిన సుజాత కృష్ణ యాదవ్ దంపతులకు  అండగా నిలవాలని బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి ఆదేశం మేరకు మంగళవారం సిసిఎస్, చిన్న చెర్లపల్లి వాసులతో కలిసి ట్రస్ట్ ప్రతినిధులు  పెళ్లికూతురు యశ్మిత యాదవ్ కు  
రూ 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా నేమూరి మహేష్ గౌడ్ మాట్లాడుతూ చర్లపల్లి పరిసర కాలనీలు, బస్తీలలో నివాసం ఉంటూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా విద్యార్థులకు, క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేస్తూ ఆ కుటుంబాలకు తమ ట్రస్టు భరోసాను కల్పిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్, బిఎల్ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు ఎంపల్లి పద్మా రెడ్డి, చెంచురెడ్డి, బీరప్ప, శశాంక్ యాదవ్, కరణ్, లోకాంత్, ప్రణీత్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.