"కాకా" ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణి

Published: Thursday June 10, 2021

బెల్లంపల్లి, జూన్ 9, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండలంలో "కాకా" పౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు బిజెపి నాయకులు తెలిపారు. బుధవారం నాడు వారు మాట్లాడుతూ కరోణా లాక్ డౌన్ కష్టకాలంలో కరోనా మహమ్మారి బారిన పడి ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ శ్రీ.జీ వెంకట స్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి సహకారంతో బుధవారం నాడు బీమిని మండలంలోని 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ బిజెపి అధ్యక్షులు కోడి రమేష్, బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు, తాండూర్ మండల ఇన్ఛార్జ్ రివెళ్ళి రాజలింగు, బిమీని మండల ప్రధాన కార్యదర్శి మేక తిరుపతి, బండి అశోక్ గౌడ్, బీసీ మోర్చ మండల అధ్యక్షులు పోతురాల్ల శంకర్, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.