వి ఆర్ ఎ ల బైక్ ర్యాలీ

Published: Thursday September 08, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 07, ప్రజాపాలన : వి ఆర్ ఎ ల బైక్ ర్యాలీ బుధవారం నిరవధిక సమ్మె  45 వ రోజున రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జన్నారం మండల నుంచి నస్పూర్ మండలం వరకు బైక్ ర్యాలి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జేఏసీ చైర్మన్ ఓంకార్, నస్పూర్ మండల జేఏసీ చైర్మన్ సురిమిల్ల కార్తిక్, జన్నారం , దండేపల్లి, హజీపూర్, మంచిర్యాల మండల ల వి ఆర్ ఎ లు పాల్గొన్నారు.