రెండు తెలుగు రాష్ట్రాల పౌరాణిక, సాంఘిక నాటక బ్రొచర్ ఆవిష్కరణ
Published: Wednesday February 16, 2022
మధిరఫిబ్రవరి 15 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మాటూరు పేట గ్రామంలో మంగళవారం నాడు సీతా రామాంజనేయ కళాపరిషత్ అధ్యక్షులు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ బ్రోచర్ను కళాపరిషత్ అధ్యక్షులు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్ చేతుల మీదగా ఈరోజు మాటూరుపేట రామాలయంలో సర్పంచ్ రావూరి శివనాగకుమారి అధ్యక్షతన జరిగిన సభలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి నెల 18,19,20 తేదీలలో రెండు తెలుగు రాష్ట్రాల పౌరాణిక, సాంఘిక నాటకాలు మధిర రిక్రియేషన్ క్లబ్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన 18వ తారీకు ఉదయం 10 గంటలకు ఉంటుందని అన్నారు. పౌరాణిక, సాంఘిక, రాగ.. తాళ.. బావ.. యుక్త కలలో ఆసక్తిగలవారు పాల్గొనవచ్చు అన్నారు. కార్యక్రమంలో సీతారామాంజనేయ కళాపరిషత్ అధ్యక్షులు గడ్డం సుబ్బారావు, రావూరి, రామారావు మాదల రామారావు, తాటికొండ వెంకటేశ్వరరావు, కృష్ణారెడ్డి, చిలువేరు శాంతయ్య పాల్గొన్నారు.
Share this on your social network: