సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Published: Friday January 21, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలో గడ్డమల్లయ్యగూడ గ్రామానికి చెందిన దండు జంగయ్యకి ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్రె మల్లేష్, గ్రామశాఖ అధ్యక్షులు అచ్చన బీరప్ప, వర్డ్ సబ్యులు రామలింగారెడ్డి, గ్రామశాఖ ఉపాధ్యక్షులు జంగయ్య, తదితరులు పాల్గొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలోని బొంగ్లూర్ కి చెందిన ఎరుకల ఊహ కి ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన 32,000 రూపాయల సీఎం చెక్కును ఊహ తండ్రి చంద్రయ్యకి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  అందజేశారు. కార్యక్రమంలో పయిళ్ల శ్రీనివాస్ రెడ్డి, పల్లె సదానంద్ గౌడ, ఆదిభట్ల మున్సిపాలిటీ యువజన విభాగం అధ్యక్షులు పయిళ్ల తిరుమల్ రెడ్డి, పల్లె దర్శన్ గౌడ్, ఆదిభట్ల మున్సిపాలిటీ సోషల్ మీడియా కన్వీనర్ ఎరుకల ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.