పేదలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
Published: Friday December 30, 2022
బోనకల్, డిసెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గార్లపాడు గ్రామంలో ఆర్ సి ఎం చర్చ్ నందు విచారణ గురువులు ఫాదర్ జి అమృతయ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర సందర్భంగా 55 నిరుపేద కుటుంబాలకు, వృద్ధులకు గురువారం దుప్పట్లు పంపిణీ చేయడం జరిగినది. పాలేరు విచారణ గురువులు కొమ్ము అంతోని దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు విచారణ గురువులు ఫాదర్ ఏసు రత్నం , గ్రామ సర్పంచ్ దారెల్లి నరసమ్మ , సంఘ పెద్దలు, సంఘస్తులు ,గ్రామ ఉపదేశి దారెల్లి సుందర్ రావు, కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఫాదర్ కొమ్ము అంతోని ని సంఘ పెద్దలు శాలువా, పూల మాలతోసన్మానించి ఫాదర్ కి కృతజ్ఞతలు తెలియజేసినారు.
Share this on your social network: