ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 22 వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు బంగారు తెలంగాణ తీర్చిదిద్దారని భారతదేశంలోనే ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాలు తీసుకొచ్చి చూపు లేని వారికి చే యుతనందిస్తున్నటువంటి ప్రభుత్వమని మధ్యతరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆమె తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 22వ వార్డు ప్రజలతో పాటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు ఇతర వార్డులలో కంటి వెలుగు కార్యక్రమాని వినియోగించుకోని వారు 22 వార్డులో ఉన్న అంగన్వాడి స్కూల్ లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ యూసుఫ్, సీనియర్ నాయకులు తాళ్ల మహేష్ గౌడ్,వైద్య సిబ్బంది, శానిటేషన్ ఇన్స్పెక్టర్ జంగయ్య, మున్సిపల్ సిబ్బంది, పాల్గొన్నారు.*
Share this on your social network: