రభిలో రైతులు ఆరుతడి పంటలనే వేసుకోవాలి...

Published: Friday October 01, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కండ్లపల్లి క్లస్టర్ పరిధిలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన వేసంగి ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వేసంగిలో వరికి బదులు ప్రత్యన్మయంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న నువ్వు తదితర పంటలను వేసుకోవాలని రైతులకు అవగాహన సదస్సులో ఏవో అనూష వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ భలుమురి లక్ష్మణ్ రావు ప్యాక్స్ ఛైర్మన్ పొల్సాని నవీన్ రావు సర్పంచులు పర్వతం రమేష్ అజ్మీర ప్రభాకర్ బోడ స్వప్న చుంచు శారద బందెల మరియా చిక్రం సుగుణ నల్ల మహిపాల్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారులు శిరీష సందీప్ రైతులు పాల్గొన్నారు.