ధాన్యం సత్వరమే కొనుగోలు చేయాలి

Published: Thursday November 25, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి  ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కు బుధవారం ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జెడల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రత్యేకమైన కమిటీ వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.  అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గురునాథ్ రెడ్డి, చర్లపటేల్ గుడ ఎంపీటీసీ ఆంజనేయులు, నరెందర్, శ్రీనివాస్ రెడ్డి, సామల రవీందర్ రెడ్డి, రైతు చెరుకూరి కిషన్, రవి నాయీ బ్రాహ్మన్ తదితరులు పాల్గొన్నారు.