బనిగండ్లపాడు గ్రామంలో కరోనా వ్యాక్సిన్ గురించి చైతన్య సదస్సు...

Published: Tuesday November 23, 2021
నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి: సోమవారం బనిగండ్లపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కరోనా వ్యాక్సిన్ గురించి ప్రత్యేక బృందం ద్వారా చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక బృందం వారు మాట్లాడుతు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు పెట్టుకోవాలని, ఏ భయం లేకుండా కరోనా టీకా వేయించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.