రాజ్యసభ సభ్యులకు ఘన స్వాగతం పలకాలి
Published: Thursday June 16, 2022
ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు..
తల్లాడ, జూన్ 15 (ప్రజాపాలన న్యూస్):
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 18న ఖమ్మం జిల్లాకు రానున్న రాజ్యసభ సభ్యులు వద్దిశెట్టి రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలకు ఘన స్వాగతం పలకాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డేమ్ వీర మోహన్ రెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పిలుపుమేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. తొలిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్ లాల్, జోన్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతి, నాయుడు శీను, దిరిశాల దాసురావు, పట్టణ అధ్యక్షులు జి వి ఆర్, ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: