పలు పూజా కార్యక్రమాలలో పాల్గొన్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మరియు ప్రభుత్వ విప్ రేగా కాంత

Published: Thursday October 06, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మరియు రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి పలు పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ దేవి  శరన్నవరాత్రులలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దేవి పూజ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మరియు అందరి ఇండ్లలో కూడా సుఖసంతోషాలు వెదజల్లాలని ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో పూజలు జరుపుకోవాలని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. అంతేకాకుండా రేగ సుధారాణి మాట్లాడుతూ ప్రజలు బతుకమ్మ పండుగ తో పాటు దేవి శరన్నవరాత్రులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వారు చెప్పారు. చెడును పాల ద్రోలి మంచిని స్వీకరించే విధంగా దేవి ఆశీర్వాదం అందరికీ ఉంటుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు మరియు బూర్గం పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి మరియు బూర్గంపాడు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కామిరెడ్డి కొండారడ్డి, సోషల్ మీడియా యూత్ చల్లకోట పూర్ణ, టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శీను బొబ్బిలి, ఏసోబు బాలు శ్రీహరి టౌన్ యూత్ చైతన్య రెడ్డి, ఏసోబు, లలిత రమణ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.