ప్రభుత్వ ఆసుపత్రి పనితీరును పరిశీలించిన. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే.

Published: Thursday January 12, 2023

మంచిర్యాల టౌన్, జనవరి 11, ప్రజాపాలన: రాష్ట్ర ప్రభుత్వం 10 కిలోల ఉచిత రేషన్ బియ్యం తక్షణమే పేద ప్రజలకు అందించాలని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ అన్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా కాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నెల రెండో వారం వచ్చిన సంక్రాంతి పండుగ దగ్గరికి సమీపిస్తున్న వేళ ఇప్పటి వరకు పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలలో ఉచితంగా రేషన్ బియ్యం అందించకపోవడం పై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 13 లక్షల మెట్రిక్ టన్నుల రూ.4300 కోట్లతో ఉచిత రేషన్ బియ్యం రాష్ట్రానికి అందిస్తే ఈ రాష్ట్రం ప్రభుత్వం మాత్రం ఆ బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించకుండా అడ్డుకుంటుంది అని అన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే బియ్యం పంపిణీ ప్రారంభించి ప్రతి ఒక్కరికీ 10 కిలోల రేషన్ ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజినిష్ జైన్, తుల ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, తోట మల్లికార్జున్, జోగుల శ్రీదేవి, కుచాడి సతీష్ గుర్రాల లావణ్య, గోదారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.