మొదటి బహుమతి పొందిన నిత్యశ్రీ

Published: Friday September 09, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి మండల స్థాయిలో నిర్వహించిన "సమాజ అభివృద్ధిలో ఇన్సూరెన్స్ పాత్ర "  అనే అంశంపై ఇన్సూరెన్స్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన  వ్యాసరచన పోటీల్లో స్థానిక ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ కు చెందిన 7వ తరగతి  విద్యార్థిని ఓ, నిత్యశ్రీ మొదటి బహుమతి సాధించిందని స్కూల్ కరస్పాండెంట్ వి, చక్రపాణి తెలిపారు.
మొదటి బహుమతికి ఎంపికైన నిత్యశ్రీ కి బ్రాంచ్ మేనేజర్ టి, రవిశంకర్, బహుమతి అందించగా, పాఠశాల కరస్పాండెంట్ చక్రపాణి,  ఉపాధ్యాయులు  ఆమెను అభినందించారు.